
Sharmila, AP New PCC Chief
అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు.
Also Read: YS Sharmila as AP PCC Chief: నేడో , రేపో షర్మిలకు పిసిసి చీఫ్..! జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..?
ఇటీవలే ఆమె తన YSRTPని కాంగ్రెస్ లో విలీనం చేసి, హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. షర్మిలను AP New PCC చేయడానికి గిడుగు రుద్రరాజు చేత తన పదవికి రాజీనామా చేయించిన అధిష్ఠానం. దానికి కొనసాగింపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం తరుపున ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు.
ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేశారు.

-By Guduru Ramesh, Sr. Journalist