
CBN PK Meet
రేపటి అసెంబ్లీ సమావేశాలకై ప్రత్యేక హెలికాప్టర్ లో Chandra babu ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన కాసేపటికే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా అక్కడికి చేరుకున్నారు. వారి మధ్య సీట్ల సర్దుబాటు పైనే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.
ఒక పక్క అధికార పార్టీ వైసీపీ జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ(TDP) జనసేన(Janasena) నేతలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు అధినేతలు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలలో ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తుంది. కానీ ఇరుపార్టీల అధినేతల మీద ఆశావహులు నుంచి ఒత్తిడి చాలా వుంది. ఈ మద్యే చెరొక రెండు సీట్లు ప్రకటించడం మనం చూసాం కూడా. జనసేన మూడు వంతుల సీట్ల కావాలని పట్టుపట్టడం కూడా చర్చలు ఓ పట్టాన తేలడం లేదు. దాంతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో సీట్ల సర్దుబాటుపై అధినేతలు తుదిమెరుగులు దిద్దనున్నారని తెలుస్తోంది.
కాగా చంద్ర బాబు ఇప్పటికే గోదావరి జిల్లా నాయుకులకు త్యాగాలకు సిద్ధం కావాలని సంకేతం ఇచ్చారు. దీనితో జనసేన గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ సీట్ల లో పోటీ చేయబోతోందని స్పష్టం అవుతుంది. ఎన్ని సీట్లు అనేది తేలవలసి వుంది. ఇక టికెట్ రానివారికి అధికారంలోకి రాగానే ఇతర అవకాశాలు ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత CBN PK Meet తరువాత ఏవైనా ప్రకటనలు ఉంటాయా ? అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కొసమెరుపు: ఏపీలో ఏప్రిల్ లో జరగబోయే ఎన్నికల కోసం టీడీపీ – జనసేన కూటమిగా ఏర్పడ్డ సంగతి తెల్సిందే. పొత్తు అయితే ఖాయమైంది కానీ సీట్ల పంపకం పైన ఇంకా కసరత్తు కొనసా… గిస్తున్నాయి. జీళ్ళ పాకం లా చర్చలు సా…గుతున్నాయి కానీ విషయం తేలక కార్యకర్తలు, నాయుకులు తీవ్రమైన అసహనంతో వున్నారు. ఇంకో పక్క ఇంచార్జిలను మార్చడంతో వైసీపీ పార్టీ కార్యకర్తలు గందరగోళం లో ఉంటే టీడీపీ – జనసేన కూటమి సీట్లు ప్రకటించక పోవడంతో కార్యకర్తలు అసహనంతో వున్నారు.
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారితో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని శ్రీ చంద్రబాబు గారి నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. pic.twitter.com/mlR7uAGSMv
— JanaSena Party (@JanaSenaParty) February 4, 2024