
TDP Raa Kadili Raa
రేపల్లె: సైకో పాలనను సాగనంపేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) రా కదలి రా(TDP Raa Kadili Raa) అంటూ పిలుపు నిచ్చారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణంలోని టీడీపీ(TDP) కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈనెల 17న బాపట్ల పార్లమెంట్ పరిధిలో రా కదలిరా బహిరంగ సభను ఇంకొల్లులో నిర్వహించనున్నట్లు తెలిపారు.
వైసీపీ దౌర్జన్యాలు అరాచకాలను ప్రజలకు తెలియజేసి, సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న దౌర్జన్యకాండను ఎండ కట్టి ప్రజలను చైతన్యం చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్నారన్నారని చెప్పారు. వైసిపి దౌర్జన్యాలు ఎదుర్కొంటూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహాశక్తిగా ఆవిర్భవించిందన్నారు.
వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. రా కదలిరా పేరుతో అధినేత చంద్రబాబు నాయుడు తారకరామా విజయభేరి ప్రాంగణంలో ఈ నెల 17న సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సభకు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రా కదలిరా సభతో వైసిపి ప్రభుత్వ పతనానికి నాంది పలకాలన్నారు.
కార్యక్రమంలో టీడీపి పట్టణ అధ్యక్షుడు జిపి రామారావు, నాయకులు జీవి నాగేశ్వరరావు, వి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist