
Tax on temples in Karnataka
కర్ణాటక ప్రభుత్వం బుధవారం హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ శాఖ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల ఆదాయంలో 10 శాతాన్ని(10% Tax on Temples) ప్రభుత్వం వసూలు చేయాలని బిల్లులో నిర్దేశించారు.
Tax on temples బిల్లుపై బిజెపి
ఈ బిల్లుపై బిజెపి(BJP), కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం “హిందూ వ్యతిరేక విధానాల”లో నిమగ్నమైందని మరియు నిధుల దుర్వినియోగం తప్పదని ఆరోపించింది. ఈ బిల్లు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన “ఖాళీ ఖజానాను” నింపుకోవడానికి ప్రయత్నిస్తోందని బిజెపి కర్ణాటక విభాగం అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప X పోస్ట్లో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల నుండి మాత్రమే ఆదాయాన్ని ఎందుకు వసూలు చేస్తుందని బిజెపి నాయకుడు ప్రశ్నించారు.
“హిందూ దేవాలయాలపై మాత్రమే ఎందుకు దృష్టి సారిస్తున్నారు? ఇతర మత స్థలాల ఆదాయంపై ఎందుకు దృష్టి సారించటం లేదు?” అని లక్షలాది మంది భక్తుల మదిలో మెదులుతున్న ప్రశ్న.
Tax on temples బిల్లుపై కాంగ్రెస్ వివరణ
కర్నాటక రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత రామలింగా రెడ్డి బిజెపి ఆరోపణలను తోసిపుచ్చారు, “ప్రభుత్వం డబ్బు తీసుకోవడం లేదు, దానిని ‘ధార్మిక పరిషత్’ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది.” ‘బీజేపీ కూడా తమ హయాంలో ఇలా చేసిందని, రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఆదాయం ఉన్న దేవాలయాల నుంచి 5 శాతం తీసుకున్నారు. రూ. 25 లక్షలకు పైబడిన ఆదాయానికి 10 శాతం తీసుకున్నారు’ అని ఇండియా టుడే టీవీతో అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అర్చకుల అభ్యున్నతి, సి గ్రేడ్ ఆలయాల అభ్యున్నతి, అర్చకుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ‘ధార్మిక పరిషత్’ ఉద్దేశాల్లో ఉన్నాయని మంత్రి అన్నారు.
కొసమెరుపు: సమస్యలను సృష్టించడం, చివరికి తానే దానికి బలి అవ్వడం అనేది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ కి తెలిసినంతగా మరి ఏ పార్టీకి తెలియదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ బిల్లు ఎందుకు అంటే, వున్న నాలుగు ఎంపీ సీట్లు పోగొట్టుకోవడానికి.