
రాజకీయంగా ఆవేశపూరిత వాతావరణం మరియు సామాజిక-రాజకీయ సమస్యలలో చురుకైన విద్యార్థి సంఘం ప్రమేయానికి JNU ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్కాలర్స్ తో పాటు, మాములు పంచాయితీ ఎన్నికల్లో లా కొట్టుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు.
ఇక విషయానికి వస్తే గత రాత్రి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU)లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యులు, వామపక్ష మద్దతు గల గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్లో ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక విషయంలో తలెత్తిన వాగ్వాదం అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. కొంతమంది విద్యార్థులు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేరినట్లు యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.
JNU విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక కోసం school-level జనరల్ బాడీ సమావేశాలను నిర్వహిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో విస్తృతంగా ప్రసారం చేయబడిన వీడియోలో, ఒక వ్యక్తి కర్రతో విద్యార్థులను కొట్టడాన్ని చూడవచ్చు. మరో వీడియోలో ఓ వ్యక్తి విద్యార్థులపైకి సైకిల్ను విసిరినట్లు కనిపిస్తున్నారు. యూనివర్శిటీ భద్రతా సిబ్బంది వారిని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు.
ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక విషయంలో తలెత్తిన ఘర్షణకు ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. “మాకు రెండు వైపుల నుండి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. ముగ్గురు గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది” అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
JNU ABVP Vs AISA
ఎంపిక ప్రక్రియకు అంతరాయం కలిగించే ప్రయత్నాలను అడ్డుకోవడంతో కన్హయ్య కుమార్ నేతృత్వంలోని ABVP సభ్యులు విద్యార్థులపై భౌతిక హింసకు పాల్పడ్డారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆరోపించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లిబరేషన్తో అనుబంధంగా ఉన్న వామపక్ష విద్యార్థి సంస్థ, ABVP సభ్యులు సాధారణ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించింది. “రాబోయే ఎన్నికల కమిటీకి ఎవరైనా ముస్లిం విద్యార్థి తమ పేర్లను ప్రతిపాదించినప్పుడల్లా వారు వ్యతిరేకించారు. వారు విద్యార్థులను బెదిరించడం ద్వారా, లింగవివక్ష మరియు కులపరమైన దూషణల ద్వారా పాఠశాల GBM ఆవరణలోని వాతావరణాన్ని కూడా నాశనం చేశారు” అని చెప్పారు.
జనరల్ బాడీ మీటింగ్ సమయంలో ఎన్నికల ప్రక్రియను రిగ్గింగ్ చేయడానికి వామపక్ష భావాలు గల విద్యార్థులు ప్రయత్నిస్తున్నారని ABVP JNU అధ్యక్షుడు ఉమేష్ చంద్ర అజ్మీరా ఆరోపించారు. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ విద్యార్థులు అభ్యంతరాలు లేవనెత్తారని, దీంతో మొత్తం ప్రక్రియ 3-4 గంటలకు పైగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.
“ఐషే ఘోష్ (JNU ప్రెసిడెంట్) మరియు డానిష్ (ఎఐఎస్ఎఫ్ సభ్యుడు) పరస్పర విరుద్ధమైన విషయాలు చెప్పారు. విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పేర్లను బహిర్గతం చేయాలని, ఆ పేర్లను ఉపసంహరించుకోవాలని మరియు హేతుబద్దమైన, న్యాయమైన ప్రక్రియ ద్వారా ఎంపిక చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. వామపక్ష విద్యార్థులు ఈ మధ్య హెక్లింగ్ ప్రారంభించారు, ఇంకా ‘డాఫ్లి’ని ఆయుధాలుగా ఉపయోగించి విద్యార్థులపై దాడి చేశారు” అని చెప్పారాయన.
యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ నుండి తక్షణ ప్రతిస్పందన అందుబాటులో లేదు మరియు ఈ సంఘటనలో గాయపడిన విద్యార్థుల సంఖ్యను కూడా నిర్ధారించలేదు.