
Viveka’s Murder
వివేకానంద రెడ్డి హత్యకు(Viveka’s Murder) సంబంధించి యర్ర గంగిరెడ్డి సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వైస్సార్ జిల్లా వీరపునాయునిపల్లి మండలంలోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖలు చేశారు. ఇక అవినాష్ రెడ్డి ఆ సమయం లో మౌనంగా వింటూ ఉండి పోయారే తప్ప ఆ వ్యాఖలను ఖండించలేదు.
ఇంకెన్ని దారుణాలు వినాలో🙏#AbbaiKilledBabai🪓#HelloAP_ByeByeYCP👋 pic.twitter.com/0WQEGFQIFb
— JanaSena Party (@JanaSenaParty) April 6, 2024
వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ అక్కడికి వెళ్ళాడనీ.. వివేకాకు యర్ర గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఒకటే మంచంలో పడుకుని, ఒకటే కంచంలో తినేంత సన్నితులు. సన్నిహితుడు కాబట్టే రక్తపు మరకలు తుడిచే సమయంలో అవినాష్ అడ్డుకోలేకపోయాడని వివరించారు రవీంద్రనాథ్ రెడ్డి. వైఎస్ వివేకా హత్య ఆయన ప్రమేయం ఏమీ లేదని.. ఆయన చూస్తూ ఉన్నారని స్పష్టం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎర్ర గంగిరెడ్డి మరకలు తుడిచాడు.. అవినాష్ రెడ్డి అమాయకుడు కాబట్టి పినాయిలు, తడి గుడ్డ ఇచ్చాడు అంతే – విజయమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి 🙏🏽pic.twitter.com/i2qUOptqp6
— TDP Germany (@TDP_Germany) April 6, 2024