
Evergreen Classic Movie Malleeswari గురించి కొన్ని విశేషాలు
1951డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రాన్ని poem on the celluloid గా విమర్శకులు అభివర్ణించారు. మల్లీశ్వరి సినిమాను వాహినీ ప్రొడక్షన్స్ పక్షాన బి.ఎన్.రెడ్డి (B.N.Reddy) నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆయన కొంతకాలం రవీంద్రుని శాంతినికేతన్ లో ఉండటం వలన ఆయన లలితకళలవైపు ఆకర్షితులయ్యారంటారు.
1939లో వందేమాతరం చిత్ర నిర్మాణ సమయంలో హంపీ విరూపాక్ష ఆలయం దర్శించినప్పుడు, శ్రీకృష్ణదేవరాయలపై ఒక చిత్రం నిర్మించాలని అనుకున్నారట.అప్పుడే the Illustrated Weekly of India లో వచ్చిన The Emperor and the Slave కథను చదివి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని స్క్రిప్టుగా మలచమన్నారంటారు.అయితే అప్పటికే రచయిత బుచ్చిబాబు రాయలవారి కరుణా కృత్యం అనే కథను రాశారు.అది మద్రాసు రేడియో లో నాటకంగా ప్రసారమైంది.అది కూడా ఆధారమని తర్వాత కృష్ణశాస్త్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాజుల కాలంలో లలిత కళల్లో రాణించివారికి రాణివాసం కు ఆహ్వానం పలికేవారు.కానీ కట్టుదిట్టమైన నియమాలు ఉండేవి.నియమాలు ఉల్లంఘించిన వారికి మరణశిక్ష విధించేవారు.ఇది మల్లీశ్వరి కథా వస్తువు.ప్రేమికులను విడదీసిన రాణివాసం వద్దనిపిస్తుంది.
ఇక Classic Movie Malleeswari కి ప్రాణం సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం, కృష్ణశాస్త్రి గారి సాహిత్యం. ఇక భానుమతి, ఎన్టీఆర్ నాయిక నాయకులుగా అభినయంతోపాటు భానుమతి,ఘంటసాల గానం చేసిన అద్భుతమైన పాటలతో మల్లీశ్వరి cult classic movie గా నిలిచిపోయింది. పందొమ్మిది పాటలున్నాయి ఈ చిత్రంలో.ఆ రోజుల్లో సినిమాలు సంగీత ప్రధానంగా ఉండటం అందుకు కారణం కావొచ్చు. ఆనాటి సినిమాలు విలువలు ప్రధానంగా సాగుతుండేవి. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది ఈ చిత్రం.
– By Radio Rambabu