
ఆలపాటి(Alapati Rajendra Prasad) అసంతృప్తి
ఈసారి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) ఎవరు ఏ పార్టీలోకి ఎప్పుడు మారుతున్నారో తెలియని విచిత్ర పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (Alapati Rajendra Prasad) కూడా పార్టీ మారబోతున్నారా? 7వ సారి టికెట్ రాలేదని, వరుసగా 6 సార్లు టికెట్ ఇచ్చి గౌరవించిన టీడీపీ పార్టీని వీడడానికి సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది.
ఒక వైపు వైసీపీ నుంచి సిట్టింగులు, నాయుకులు కూటమి పార్టీల్లోకి రావడంతో, కొంత మంది సీనియర్లకు, మాజీ మంత్రులకు కూడా టీడీపీ లో టికెట్ దక్కని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళల్లో కొంత మంది పార్టీ వీడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమిని ఇది కాసింత ఇబ్బంది పెడుతుంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గమైన తెనాలి(Tenali) స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. దీంతో మార్పులు, చేర్పులు తరువాత వేరే నియోజకవర్గం అయినా అధిష్టానం ఇస్తుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (Alapati Rajendra Prasad) ఆశించారు. మూడో జాబితాలో కూడా ఆయన పేరు లేదు. వాస్తవానికి తెనాలి సీటు జనసేన(Janasena)కు కేటాయించిన తర్వాత.. ఆలపాటి(Alapati) కి ప్రత్యామ్నాయం చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ హామీ నెరవేరకపోవడంతో ఆలపాటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇంకో వైపు తొలి జాబితా లో పేరు లేకపోవడంతో ఆలపాటి వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లారని అందుకే చంద్రబాబు ప్రత్యామ్నాయం జోలికి వెళ్లలేదనే టాక్ కూడా నడుస్తోంది.
టికెట్ రాకపోవడంతో ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఆలపాటి భావిస్తున్నారని, శుక్రవారం సాయంత్రం తెనాలిలో ఆత్మీయులతో ఆలపాటి సమావేశం కాబోతున్నారని, టీడీపీని వీడుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అభిమానులు, కార్యకర్తల సమక్షంలోనే పార్టీ మార్పు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. టీడీపీకి గుడ్ బై చెప్పాల్సి వస్తే.. ఏ పార్టీలో చేరతారు..? బీజేపీలోకి వెళ్తారా లేకుంటే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది ఇంకా తెలియరాలేదు.
కొసమెరుపు: ఆలపాటి కి టీడీపీ 1994 నుంచి 2019 వరకు వరుసగా ఆరుసార్లు టికెట్ ఇచ్చింది. ఆరుసార్లలో 3 సార్లు గెలిచి, మరో 3 సార్లు ఓటమి చెందారు. టికెట్ రాకపోతే చాలు, 30 ఏళ్లకు పైగా ఉన్న పార్టీ అని కూడా చూడకుండా ఎలా వీడిపోతారు? అయినా ఇలా ఒకళ్లకే టికెట్ ఇచ్చుకుంటూ పోతే, యువ నాయకత్వం ఎలా వస్తుంది?. నిజానికి ఇది టీడీపీకి పెద్ద లోపంగా మారి సీనియర్ల పార్టీ గా మారింది. కనీసం 3 లేదా నాలుగు సార్లు అవకాశం పొందిన సీనియర్ల ను పక్కన పెట్టి యువతరాన్ని ప్రోత్సహించక పోతే భవిష్యత్తు లో పార్టీ మనుగడే ప్రస్నార్ధకంగా మారవచ్చు. ఇక సీనియర్లు కూడా ప్రతి సారి టికెట్ ఆశించకుండా వాళ్ళ అనుచరలకు, యుతరానికి దారి ఇస్తే వాళ్లకు గౌరవంగా ఉంటుంది. పార్టీ కూడా బలపడుతుంది. ఇకపోతే సీనియర్లు అసంతృప్తికి గురికాకుండా MLC లేదా నామినేటెడ్ పదవులతో గౌరవిస్తే సరి.