Bhogi Celebrations: భోగి వేడుకల్లో సీఎం జగన్, మాజీ సీఎం బాబు మరియు పవన్ కళ్యాణ్

Bhogi Celebrations: తాడేపల్లిలోని తమ నివాసంలో సీఎం జగన్ దంపతులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మందడంలో ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరు పంచ కట్టి సందడి చేశారు
Share the news
Bhogi Celebrations: భోగి వేడుకల్లో సీఎం జగన్, మాజీ సీఎం బాబు మరియు పవన్ కళ్యాణ్

సీఎం జగన్ నివాసంలో Bhogi Celebrations

సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), ఆయన సతీమణి భారతితో కలిసి తాడేపల్లిలోని (Tadepalli) తమ నివాసంలో భోగి వేడుకల్లో (Bhogi Celebrations) పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. అనంతరం గంగిరెద్దులకు చీరలు సారెలు సమర్పించారు. గోపూజ చేసిన తరువాత వేద పండితులు సీఎం దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అటు, సీఎం నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నిర్మించిన నమూనా ఆలయం ఆకట్టుకుంది. ఆ ఆలయంలో జగన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సుబ్బారెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

అంతకు ముందు X (ట్విట్టర్) వేదికగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి, సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ శాంతులతో విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు మందుకు వేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగీ, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.’ అంటూ ట్వీట్ చేశారు.

మందడం గ్రామంలో Bhogi Celebrations లో చంద్రబాబు & పవన్ కల్యాణ్

ఇక రాజధాని అమరావతి (Amaravathi) పరిధిలోని మందడం (Mandadam) గ్రామంలో నిర్వహించిన భోగి వేడుక(Bhogi Celebrations)ల్లో TDP అధినేత చంద్రబాబు (Chandra babu), జనసేన(Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. అమరావతి ఐకాస, టీడీపీ – జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగు జాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఇరు పార్టీల నేతలు, అభిమానులు, కార్యకర్తలు, రాజధాని ప్రాంత రైతులు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలూ సంప్రదాయ బద్దంగా పంచె కట్టుకుని సందడి చేశారు. భోగి మంటలు వెలిగించిన అనంతరం.. ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు, ప్రజా వ్యతిరేక జీవోల కాపీలను మంటల్లో తగలబెట్టారు. ఆ తర్వాత టీడీపీ – జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఇరువురూ కొద్దీ సేపు మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని.. రాబోయేవి మంచి రోజులని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతుల సంకల్పం నెరవేరుతుందని.. బంగారు రాజదానిని నిర్మించుకుందామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

See also  Is YSRCP getting troubles Before Elections? కొత్త In charge ల నియామకంతో వైసీపీ నేతల్లో మొదలైన టికెట్ల అలజడి

Also Read News

Scroll to Top