Prajagalam: బొప్పూడి ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం!

ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం(Prajagalam) సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం
Share the news
Prajagalam: బొప్పూడి ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం!

ప్రజాగళం(Prajagalam) సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రసంగం!

ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం – దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.

ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పారిపోతున్నాయి. అమరరాజ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కణ్ణుంచి వెళ్లిపోయాయి. జగన్ ను రావణుడితో పోల్చిన పవన్ కల్యాణ్, జగన్ రావణుడిలా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. రావణ సంహారం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరుగుతుంది. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారు. ఇది దుర్మార్గ ప్రభుత్వం. దిగిపోవాలి. రామాలయం కట్టిన మోదీకి రావణుడిని తీసేయడం సాధ్యం కాదా? ధర్మానిదే విజయం.. కూటమిదే పీఠం..అని Prajagalam లో అన్న జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్

See also  Facilitation to Censor Board Member Allamsetti Haripriya: అల్లంశెట్టి హరిప్రియకు సన్మానం

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top