TSPSC Group 4 Results! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇక్కడ..

TSPSC Group 4 Results : TSPSC గ్రూప్ 4 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 9న విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థుల సాధారణ ర్యాంకింగ్ జాబితా(GRL) వివరాలను విడుదల చేసింది.
Share the news
TSPSC Group 4 Results! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇక్కడ..

TSPSC Group 4 Results released

TSPSC Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) ఫిబ్రవరి 9న విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థుల ర్యాంక్ వివరాలను విడుదల చేసింది. TSPC మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో సాధారణ ర్యాంకింగ్ జాబితా (GRL) విడుదల చేసింది. అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని కమిషన్ సూచించింది. అధికారిక ప్రకటన విడుదలైంది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది.

అధికారిక వెబ్‌సైట్ కోసం: Click here
TSPSC గ్రూప్ 4 ఫలితాల కోసం: Click here

తెలంగాణలో మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీకి జూలై 1, 2023న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కి 7,62,872 మంది అభ్యర్థులు, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జనరల్ స్టడీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, సెక్టోరల్ ఎబిలిటీస్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు.

See also  Padma Awardees 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here!

గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు అందాయి. తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు TSPSC ప్రకటించింది. అయితే డిసెంబర్ 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో 8039 పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మరో 141 పోస్టులు జోడించడంతో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరింది.

తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన సమాధానాల ‘కీ’ని ఆగస్టు 28న టీఎస్‌పీఎస్సీ విడుదల చేయగా.. ఆన్సర్‌కీలో అభ్యంతరాలు తెలిపేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత అక్టోబర్ 6న తుది కీని విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ.. పలు మార్పులు చోటు చేసుకుంది. పేపర్-1లో 7 ప్రశ్నలను తొలగించి.. 8 ప్రశ్నలకు సమాధానాలను మార్చారు. అలాగే పేపర్-2లో 3 ప్రశ్నలను తొలగించగా, 5 ప్రశ్నలకు సమాధానాలు మార్చారు.

See also  CBN at Prajagalam: మోదీపై ప్రశంసల జల్లు.. జగన్ పై నిప్పులు.. -ప్రజాగళం సభలో చంద్రబాబు

Also Read News

Scroll to Top