Blue Origin: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రయాణించిన మొదటి భారతీయ పైలట్ మన తెలుగువాడే!

Share the news
Blue Origin: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రయాణించిన మొదటి భారతీయ పైలట్ మన తెలుగువాడే!

Blue Origin విమానం అంతరిక్షంలోకి

జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్(Blue Origin) అంతరిక్ష నౌక, ఒక అనుభవజ్ఞుడైన భారతీయ పైలట్, కెప్టెన్ గోపీచంద్ తోటకూర(Gopichand Thotakura) సహా ఆరుగురు సిబ్బందితో సహా, ఆదివారం అంతరిక్షంలోకి బయలుదేరింది.

న్యూ షెపర్డ్ రాకెట్ మరియు క్యాప్సూల్ వెస్ట్ టెక్సాస్‌లోని ఒక ప్రైవేట్ ర్యాంచ్‌లోని బ్లూ ఆరిజిన్ సౌకర్యాల నుండి ఉదయం 9:36 గంటలకు (స్థానిక సమయం) బయలుదేరినట్లు CNN నివేదించింది. NS-25 అని పిలువబడే మిషన్ యొక్క ప్రత్యక్ష ప్రసారం బ్లూ ఆరిజిన్(Blue Origin) వెబ్‌సైట్‌లో ఉదయం 8:12 గంటలకు (స్థానిక సమయం) ప్రారంభమైంది.

క్యాప్సూల్‌లో ఉన్న ఆరుగురు సిబ్బంది – ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన కెప్టెన్ తోటకూర, వెంచర్ క్యాపిటలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రెంచ్ క్రాఫ్ట్ బ్రూవరీ బ్రాస్సెరీ మోంట్-బ్లాంక్ వ్యవస్థాపకుడు సిల్వైన్ చిరోన్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరియు వ్యవస్థాపకుడు కెన్నెత్ ఎల్ హెస్, రిటైర్డ్ అకౌంటెంట్ కరోల్ షాలర్, ఎడ్ డిచాలర్ మరియు ఎడ్ డ్వైట్( రిటైర్డ్ US ఎయిర్ ఫోర్స్ కెప్టెన్, 1961లో అప్పటి US అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ద్వారా దేశం యొక్క మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు).

See also  Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా!

Also Read: టూరిస్ట్‌గా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ పైలట్ గోపీ తోటకూర!

న్యూషెపర్డ్ (New Shephard-25)రాకెట్ కు ఇది ఏడో మానవసహిత అంతరిక్ష యాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:36 గంటలకు పశ్చిమ టెక్సాస్ లోని ప్రయోగ వేదికనుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సూల్ లో ఆరుగురు యాత్రికులు కూర్చున్నారు. యాత్ర సమయంలో రాకెట్ ధ్వని కన్నా మూడు రెట్లు వేగంతో దూసుకెళ్లింది. ఇది నేల నుంచి 100 కిలోమీటర్లు దూరంలో ఉండే కార్మాన్ రేఖను దాటింది. ఈ రేఖను భూవాతావరణానికి అంతరిక్షానికి సరిహద్దుగా భావిస్తారు. ఈ దశలో రాకెట్ బూస్టర్ నుంచి వేరైంది. వారు కొద్దిసేపు భార రహిత స్థితిని అనుభవించారు. క్యాప్సూల్ ద్వారా పుడమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీక్షించారు. అనంతరం ప్యారాచూట్ల సాయంతో క్యాప్సూల్ నేలపైకి వచ్చింది. అంతకు ముందే రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

See also  Pawan Kalyan to Godavari districts: పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మొదటి దశ పర్యటన ఖరారు!

గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్ పోర్టు ఉంది. అందువల్ల రాకేష్ శర్మ(Rakesh Sharma) తర్వాత రోదసీలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. దీనికి తోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేశారు. తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు పొందారు.

కొసమెరుపు: అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత అంతరిక్ష నౌక లో భారరహిత స్థితిలో వున్నప్పుడు భారతదేశ జెండాను చూపిన గోపీచంద్ తోటకూర..

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top