CBN fires on Jagan: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతావా జగన్ రెడ్డి.. ఎంత సిగ్గు చేటు -బాబు

CBN fires on Jagan: ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Share the news
CBN fires on Jagan: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతావా జగన్ రెడ్డి.. ఎంత సిగ్గు చేటు -బాబు

CBN fires on Jagan

ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రూ. 370 కోట్ల కోసం సచివాలయాన్ని ఓ బ్యాంకుకు తాకట్టు పెట్టారని ఓ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం ప్రచురితం అయింది. దీనిపై చంద్రబాబు స్పందించారు.

“రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు….తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా…అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!:” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

See also  Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

CBN fires on Jagan in Twitter

Also Read News

Scroll to Top