
చిరంజీవికి ఇటీవల భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిన సంగతి తెల్సిందే. అంతకు ముందు 2006 లో చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చి సత్కరిస్తే, ఇప్పుడు 18 సంవత్సరాల తరువాత పద్మ విభూషణ్ అవార్డు ఆయన్ని వరించింది. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర రావు తరువాత పద్మ విభూషణ్ దక్కించుకున్నది చిరంజీవి మాత్రమే.
ఇక ఈ అవార్డు అధికారికంగా ప్రకటించిన తరువాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన పలు శాఖల సాంకేంతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు చిరంజీవి ఇంటికి వెళ్లి అతన్ని అభినందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోజుల క్రితం చిరంజీవితో పాటు పద్మ అవార్డు గ్రహీతలు అందరికీ సన్మానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిపింది.
Honor to Chiranjeevi
ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకొని సతీ సమేతంగా అమెరికా వెళ్లిన చిరంజీవికి, అక్కడ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధి, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చిరంజీవిని కలిసి ఒక చిరు సన్మానం చెయ్యాలని చిరంజీవిని అడుగగా అయన ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమెరికా అభిమానుల తరుపున చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా విశ్వప్రసాద్ చిరంజీవి సన్మాన కార్యక్రమాన్ని(Honor to Chiranjeevi ) ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది.
Happy to have met @KChiruTweets Garu in LA and to get his consent for organizing the felicitation event. pic.twitter.com/Xr3C2jDgPs
— Vishwa Prasad (@vishwaprasadtg) February 16, 2024