
Alliance Meeting
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నివాసానికి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేరుకున్నారు. అంతకు ముందే బీజేపీ(BJP) నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekawat) బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది, వాళ్లతో పాటు జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇక పురందేశ్వరి కూడా వారితో జాయిన్ అవ్వొచ్చని తెలుస్తుంది.
ముఖ్యంగా నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ (BJP)తో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించనున్నారు. కాగా గత రెండు రోజులుగా అటు పవన్తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు. ఇక నేడు ఈ మూడు పార్టీల భేటీ(Alliance Meeting) మరింత కీలకంగా మారనుంది . నేటితో లెక్కలు తేలిపోనున్నాయి అంటున్నారు. అలాగే పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.