
Ayodhya Ram Mandir fever grips the nation
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం(Ram Mandir) గురించే, అంతా రామ నామమే వినిపిస్తోంది. ఇక్కడే కాదు ప్రపంచం లో భారతీయులు ఉన్న అన్ని చోట్ల. విదేశాల్లో ఉన్న హిందువులు కూడా అక్కడి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.
Also Read: అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం ఎలా ఉందో చూసారా ?
500 సంవత్సరాల హిందువుల కల రేపు నిజం కాబోతున్న వేళ ఇది సహజమే. ఈ మధ్య కాలంలో ఇలా ఒక భక్తి భావంలో దేశం మునిగి తేలడం చూడలేదు. ఇక పోతే హిందువులు ఇంటిని పూలతో అలంకరించుకోవడం, దీపాలు వెలిగించడం. కాషాయ జెండా ఇంటికి కట్టుకోవడం లాంటివి చేస్తూ ఒక పండుగలా చేసుకోబుతున్నారు అనడం లో అతిశయోక్తి లేదు.
Also Read: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు!
Ram Mandir fever: కాష్ చేసుకుంటున్న వ్యాపారస్తులు
ఈ నేపథ్యం లో జనం పూలు, అలంకరణ సామగ్రి, కాషాయ జెండాల కోసం మార్కెట్స్ లో ఎగబడటం చూసి కొందరు సందట్లో సడేమియాలు రేట్లు బాగా పెంచేసి ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు. ఇక ఇవి అమ్మే షాపులు జనంతో కిట కిట లాడిపోతున్నాయి. ఎంత రేటుకైనా కొనేస్తున్నారు. భక్తులు అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా భక్తి భావంతో చేసుకుంటే మంచిది.