
Bharat Rice at Rs 29
వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి భారత్ రైస్(Bharat Rice)ను కిలో ₹29కి రిటైల్ విక్రయాలను ప్రారంభించనుంది. మరోవైపు ధరలను నియంత్రించేందుకు బియ్యం స్టాక్ను వెల్లడించాలని వ్యాపారులను ఆదేశించింది.
“వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ, బియ్యం రిటైల్ మరియు టోకు ధరలు సంవత్సరానికి 13.8% మరియు 15.7% పెరిగాయి. ధరలను నియంత్రించడానికి మరియు ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను అదుపులో పెట్టడానికి, వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్ను కిలో ₹ 29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు.
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED ), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) మరియు రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా భారత్ రైస్(Bharat Rice) 5 కిలోలు మరియు 10 కిలోల ప్యాక్లలో అందుబాటులో ఉంటాయన్న సంజీవ్ చోప్రా. మొదటి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వ్యాపారులు, హోల్సేలర్లు, రిటైలర్లు, పెద్ద చైన్ రిటైలర్లు మరియు ప్రాసెసర్లు లేదా మిల్లర్లు ఆహార ధాన్యాల స్టాక్ పొజిషన్ను తప్పనిసరిగా ప్రకటించాలని చోప్రా చెప్పారు. అన్ని బియ్యం కేటగిరీల స్టాక్ పొజిషన్–బ్రోకెన్ రైస్, నాన్-బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ మరియు వరి –ప్రతి వారం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పోర్టల్లో ప్రకటించాల్సి ఉంటుంది.
దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా చెప్పారు.
ఇప్పటికే ప్రభుత్వం భారత్ అట్టాను(గోధుమ పిండి) కిలోకు ₹27.50, భారత్ దాల్ (సెనగపప్పు) కిలో ₹60కి విక్రయిస్తోన్న సంగతి తెల్సిందే. ఇప్పడు భారత్ రైస్ కిలో ₹29కే ఇచ్చినట్లయితే పేద, మధ్య తరగతి వర్గాలవారికి కొంత ఉపశమనంగా ఉంటుంది.
కొసమెరుపు: ఇక పోతే తెలుగు రాష్ట్రలలో ఈ పధకానికి ఏ అన్న పథకమో లేదా ఏ అమ్మ పధకం పేరు పెడతారో చూడాలి..