India taken a dig at China: పీఎం అరుణాచల్ పర్యటనపై చాదస్తపు ప్రకటన చేసిన చైనా పై మండిపడ్డ భారత్!

India taken a dig at China: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో, ప్రధాని పర్యటనపై చైనా నిరసన వ్యక్తం చేయడం ఏ మాత్రం సహేతుకం కాదని అన్నారు.
Share the news
India taken a dig at China: పీఎం అరుణాచల్ పర్యటనపై చాదస్తపు ప్రకటన చేసిన చైనా పై మండిపడ్డ భారత్!

India taken a dig at China

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా(China) చేసిన వ్యాఖ్యలపై భారత్(Bharat) మంగళవారం మండి పడింది(India taken a dig at China). విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) ఒక దృఢమైన ప్రకటనలో, ఈశాన్య రాష్ట్రానికి ప్రధాని పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పడం ఏ మాత్రం సహేతుకం కాదని అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ “భారతదేశంలో అంతర్భాగంగా మరియు విడదీయరాని భాగం” అని కూడా ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

“ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు సంబంధించి చైనా చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. భారత నాయకులు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలను సందర్శిస్తున్నట్లే, అప్పుడప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా సందర్శిస్తారు. అటువంటి పర్యటనలను లేదా భారతదేశ అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేయడం సహేతుకం కాదు. ఇంకా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశం యొక్క అంతర్భాగంగా మరియు విడదీయరాని భాగమని, ఇది వాస్తవం.”

See also  Indian Navy Veterans: భారత్ కు అతి పెద్ద దౌత్య విజయం.. ఖతార్‌లో మరణ శిక్ష పడిన భారతీయుల విడుదల..

చైనా పై భారత్ మండి పడడానికి(India taken a dig at China) కారణం ఏమిటి?

ప్రపంచంలోనే అతి పొడవైన జంట-లేన్ సొరంగం(Sela tunnel) అయిన వ్యూహాత్మకంగా ముఖ్యమైన సెలా టన్నెల్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించారు. భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తమ ప్రభుత్వం ఎన్నడూ గుర్తించలేదని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చైనా చాదస్తంగా మాట్లాడిడం మొదలు పెట్టింది.

ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) పర్యటనపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్(Wang Wenbin) సోమవారం ఈ ప్రకటన చేశారు.”జాంగ్నాన్ ప్రాంతం చైనా భూభాగం” అని వాంగ్ చెప్పారు. వాంగ్ వ్యాఖ్యలు అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా దీర్ఘకాలంగా అనుసరిస్తున్న వ్యూహాన్ని ప్రతిబింబిస్తున్నాయి, చైనా దానిని ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంటుంది. దాంతో చైనా పై భారత్ మండి పడి(India taken a dig at China), గట్టిగా సమాధానం చెప్పింది.

See also  Jagan Delhi Tour: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపక బహుకరించిన సీఎం జగన్

కొసమెరుపు: కమ్యూనిస్టులంటేనే పిడి వాదానికి మారు పేరు. ఇక చైనా కమ్యూనిస్టులు అంతకు మించి. ముఖ్యంగా జింపింగ్ వచ్చిన తరువాత ఇరుగు పొరుగు దేశాలతోనే కాదు, అగ్ర రాజ్యం అమెరికా తో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంది. సామ్రాజ్యవాదంతో ఎన్నో దేశాలు నాశనం అవడం మనం చరిత్రలో చూసాం. చైనా దానికి అతీతమేమి కాదు.

Also Read News

Scroll to Top