Mood of the Nation Modi 3.0: ముచ్చటగా మూడవ సారి మోడీ.. ఇండియా టుడే సర్వే

Mood of the Nation: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కి లోక్‌సభ ఎన్నికల్లో 335 సీట్లు వస్తాయని, హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ప్రముఖ మీడియా హౌస్ ఇండియా టుడే అంచనా వేసింది. I.N.D.I.A కూటమికి 166 సీట్లు వస్తాయని అంచనా.
Share the news
Mood of the Nation Modi 3.0:  ముచ్చటగా మూడవ సారి మోడీ.. ఇండియా టుడే సర్వే

ఇండియా టుడే Mood of the Nation సర్వే

భారతదేశం కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలను సమీపిస్తున్న వేళ, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (Mood of the Nation) సర్వే దేశ ప్రజల మూడ్ ఎలా ఉండబోతుందో అని అంచనా వేయడానికి ప్రయత్నించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కమాండింగ్ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. అయితే, ఇది దాని “400 P aar” లక్ష్యం కంటే బాగా తగ్గే అవకాశం ఉంది.

Also Read: ఆంధ్రాలో బాబు TDPకి అడ్వాంటేజ్, మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 అంచనా!

మూడ్ ఆఫ్ ది నేషన్ (Mood of the Nation) సర్వే ప్రకారం, ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే, BJP నేతృత్వంలోని NDA 335 సీట్లు సాధించడం ద్వారా అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉంది, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల పరిమితిని సునాయాసంగా అధిగమించవచ్చు. అయితే, కూటమి మొత్తం 18 సీట్లు కోల్పోతుందని అంచనా వేయబడింది, అత్యధికంగా లాభపడింది I.N.D.I.A కూటమి.

See also  Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా..

బీజేపీ సొంతంగా 304 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, బీజేపీ భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొంటే ఎన్‌డీఏ కూటమి బలం 335 స్థానాలకు చేరుకోనుందని ఈ సర్వే తెలిపింది. ప్రతిపక్ష I.N.D.I.A కూటమి 166 సీట్లకే పరిమితమవుతుందని, కాంగ్రెస్‌ 71 సీట్లను గెల్చుకుంటుందని పేర్కొంది.

ఇక Mood of the Nation సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రితం సారి లాగానే యూపీలో మరోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించనుంది. యూపీ లో 80 సీట్లకు గాను ఆ పార్టీ సొంతంగా 70 సీట్లను, మిత్రపక్షం ఆప్నాదళ్‌(ఎస్‌) 2 సీట్లను గెల్చుకోనున్నాయి. 2019లో ఈ రెండు పార్టీలకు కలిపి 64 సీట్లు (BJP 62) రాగా ఇప్పుడు అవి పెరగనున్నాయి. మొత్తంగా 8 సీట్లు పెరగనున్నాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన సమాజ్‌వాదీపార్టీ గత ఎన్నికల్లో గెల్చుకున్న 15 స్థానాల్లో 8 కోల్పోయి, ఈసారి ఏడు స్థానాలకు పరిమితం కానుంది. కాంగ్రెస్‌ ఒక్క సీటునే గెల్చుకోనుంది.

See also  Byju's Founder Net worth: 17 వేల కోట్ల నెట్‌వర్త్ నుంచి సున్నాకు పడిపోయిన బైజూస్ వ్యవస్థాపకుడు

యూపీ తర్వాత అత్యధిక సీట్లున్న మహారాష్ట్ర(48)లో మెజారిటీ సీట్లు(26) I.N.D.I.A కూటమి గెల్చుకోనుంది. కూటమిలోని కాంగ్రెస్‌(Congress) 12 సీట్లు, ఎన్సీపీ-పవార్‌, శివసేన-ఉద్ధవ్‌ కలిసి 14 సీట్లు గెల్చుకోనున్నాయి.

ఇక 42 సీట్లతో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 22 సీట్లను గెల్చుకోనుంది. బీజేపీకి 19 సీట్లు, కాంగ్రె్‌సకు ఒక్క సీటు లభించవచ్చు. వామపక్షాలకు ఒక్క సీటూ రాదట.

40 సీట్లున్న బిహార్‌లో ఎన్‌డీఏ 32, I.N.D.I.A కూటమి 8 సీట్లను గెల్చుకోవచ్చు. అయితే, ఈ సర్వే జరిగిన సమయానికి ఇండియా కూటమిలో ఉన్న నితీశ్‌ ఇటీవల ఎన్‌డీఏలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏకు లభించే సీట్లు మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు.

ఇక 39 సీట్లున్న తమిళనాడులో అన్ని సీట్లనూ డీఎంకే-కాంగ్రె్‌సలతో కూడిన I.N.D.I.A కూటమి గెల్చుకోనుంది.

గుజరాత్‌, రాజస్థాన్‌లను గత ఎన్నికల్లోల్లాగే ఈసారి కూడా బీజేపీ పూర్తిగా స్వీప్‌ చేయనుందని ఈ సర్వే వెల్లడించింది.

కాంగ్రెస్ క్రితం సారి కంటే 19 స్థానాలు ఎగబాకి 71 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.

Also Read News

Scroll to Top