
BoycottMaldives: మాల్దీవుల జూనియర్ మంత్రి చేసిన అవమానకరమైన కథనాన్ని ప్రతిఘటిస్తూ, భారతదేశ ప్రముఖులు మరియు ప్రఖ్యాత వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచారు. ఈ ఐక్యత అద్భుతం. క్రీడా ప్రముఖులు మరియు బాలీవుడ్ తారలు మాటలతో మద్దతు మాత్రమే కాకుండా అంతకు మించి లక్షద్వీప్ దీవులు మరియు ఇతర భారతీయ తీర పట్టణాలలోని అద్భుతమైన బీచ్ల ఫోటోలను పంచుకోవడం ద్వారా మాల్దీవుల మంత్రిపై ఎదురుదాడికి దిగారు. అలాగే క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ మరియు వెంకటేష్ ప్రసాద్ మరియు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం మరియు శ్రద్ధా కపూర్ భారతదేశంలోని అద్భుతమైన బీచ్ల గురించి తమ కథలను సోషల్ మీడియా లో పంచుకున్నారు. చాలా ఆసక్తికరంగా #BoycottMaldives మరియు #ExploreIndianIslands ఆదివారం X మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ట్రెండింగ్ లో నెంబర్ 1 లో ఉన్నాయి.
BoycottMaldives: ఎందుకు, ఎలా మొదలైంది?
మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియునా X(ట్విట్టర్)లో ఇప్పుడు తొలగించబడిన పోస్ట్తో ఇదంతా ప్రారంభమైంది. షియునా పోస్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన ఫోటోలు ఉన్నాయి. యువజన సాధికారత, సమాచార, కళల శాఖ డిప్యూటీ మంత్రి కూడా ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
— Narendra Modi (@narendramodi) January 4, 2024
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
మాల్దీవుల జూనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత దౌత్య యంత్రాంగం ఖండించగా, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు నేతృత్వంలోని ప్రభుత్వం ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ అని పేర్కొంటూ షియునా వ్యాఖ్యలకు దూరంగా ఉంది.
“ప్రజాస్వామ్య మరియు బాధ్యతాయుతమైన పద్ధతిలో భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించాలని, ద్వేషం, ప్రతికూలత వ్యాప్తి చెందకుండా మరియు మాల్దీవులు మరియు అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధాలకు ఆటంకం కలిగించకుండా ఉండాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది” అని మాల్దీవుల ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. కొద్దిసేపటి తర్వాత, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా మరియు హసన్ జిహాన్లను తొలగించింది.
#BoycottMaldives మరియు #ExploreIndianIslands X, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఎందుకు ట్రెండ్ అయ్యాయి
ఈ ఇష్యూ లో భారతదేశ ప్రముఖులు ఐక్యంగా నిలిచారు. భారతీయ ప్రముఖులు సోషల్ మీడియాలోకి వెళ్లి భారతీయ బీచ్ల గురించి తమ కథనాలను పంచుకున్నారు.
“మేము సింధుదుర్గ్లో నా 50వ పుట్టినరోజును జరుపుకున్నప్పుడు. తీరప్రాంత పట్టణం మేము కోరుకున్నవన్నీ అందించింది. అద్భుతమైన ఆతిథ్యంతో కూడిన అందమైన ప్రదేశాలు మాకు జ్ఞాపకాల నిధిని మిగిల్చాయి. భారతదేశం అందమైన తీరప్రాంతాలు మరియు సహజమైన ద్వీపాలతో నిండివుంది. మా “అతిథి దేవో భవ” సాంప్రదాయం తో, మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, మధుర జ్ఞాపకాలు ఇవ్వడానికి వేచి ఉన్నాయి, ”అని క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కొంకణ్ బీచ్లో వున్న పోస్ట్ను పంచుకున్నారు.
250+ days since we rang in my 50th birthday in Sindhudurg!
— Sachin Tendulkar (@sachin_rt) January 7, 2024
The coastal town offered everything we wanted, and more. Gorgeous locations combined with wonderful hospitality left us with a treasure trove of memories.
India is blessed with beautiful coastlines and pristine… pic.twitter.com/DUCM0NmNCz
“అద్భుతమైన భారతీయ ఆతిథ్యంతో, “అతిథి దేవో భవ” ఆలోచన మరియు విస్తారమైన తీర ప్రాంతాలు చాలా వున్నాయి చూడటానికి . లక్ష్వదీప్ వెళ్ళవలసిన ప్రదేశం,” అని నటుడు జాన్ అబ్రహం అన్నారు.
“లక్షద్వీప్లోని అందమైన శుభ్రమైన మరియు అద్భుతమైన బీచ్లలో మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోడీని చూడటం చాలా బాగుంది, మరియు గొప్ప విషయమేమిటంటే యే హమారే ఇండియా మే హైన్ ” అని సల్మాన్ ఖాన్ X పోస్ట్లో పేర్కొన్నారు.
With the amazing Indian hospitality, the idea of “Atithi Devo Bhava” and a vast marine life to explore. Lakshwadeep is the place to go.#exploreindianislands pic.twitter.com/CA1d9r0QZ5
— John Abraham (@TheJohnAbraham) January 7, 2024
#BoycottMaldives మరియు #ExploreIndianIslands పై మరి కొంత మంది X పోస్టులు
“మాల్దీవులకు చెందిన ప్రజాప్రతినిధులు భారతీయులపై ద్వేషపూరిత మరియు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తమకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే దేశానికి వారు ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది. మనం మన పొరుగువారితో మంచిగా ఉంటాము, కానీ అలాంటి ద్వేషాన్ని మనం ఎందుకు సహించాలి? నేను మాల్దీవులను చాలాసార్లు సందర్శించాను మరియు ఎల్లప్పుడూ ప్రశంసించాను, కానీ గౌరవం ముఖ్యం. #ExploreIndianIslands మరియు మన స్వంత పర్యాటకానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందాం” అని నటుడు అక్షయ్ కుమార్ అన్నారు.
Came across comments from prominent public figures from Maldives passing hateful and racist comments on Indians. Surprised that they are doing this to a country that sends them the maximum number of tourists.
— Akshay Kumar (@akshaykumar) January 7, 2024
We are good to our neighbors but
why should we tolerate such… pic.twitter.com/DXRqkQFguN
Sane ordinary Maldivians, politicians, and diplomats call for punitive action against unprofessional Maldivian ministers posting distasteful and bigoted comments against the Indian people, blame the new President for destroying Maldives-India ties at China’s behest after hundreds… pic.twitter.com/L7urVOcFpG
— Sonam Mahajan (@AsYouNotWish) January 7, 2024