
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియంలో మొదటి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో తొలిరోజు భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అదరగొట్టాడు. తన అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. జైస్వాల్ 256 బంతుల్లో 179 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ 49వ ఓవర్లో టామ్ హార్ట్లీ వేసిన బంతిని సిక్సర్ బాదడంతో 151 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. తన టెస్టు కెరీర్లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. గత ఏడాది జూలైలో వెస్టిండీస్పై అరంగేట్రం చేసిన యశస్వి టెస్టు కెరీర్లో 171 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు.
Ind vs Eng 2nd Test: Scores
Ind vs Eng 2nd Test లో యశస్వి జైస్వాల్ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్… 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్కు తోడుగా అశ్విన్ అయిదు పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్ పెద్దగా రాణించలేదు, ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. రోహిత్ (14), శుబ్మన్ గిల్ (34), శ్రేయాస్ అయ్యర్(27), రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్(27), శ్రీకర్ భరత్ (17) రన్స్ చేసి ఔటయ్యారు.
Ind vs Eng 2nd Test: యశస్వి రికార్డు
అద్భుతమైన సెంచరీతో యశస్వి తన పేరిట మరో అరుదైన రికార్డును కూడా లిఖించుకున్నాడు. 23 ఏళ్ల వయసులో స్వదేశం,లో, విదేశాల్లో టెస్టుల్లో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా ఘనతను సాధించాడు. ఇంతకు ముందు రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు. 22 ఏళ్ల 36 రోజుల వయసులో యశస్వి ఈ రికార్డును సాధించాడు.
That moment when @ybj_19 got to his second Test 💯
— BCCI (@BCCI) February 2, 2024
Watch 👇👇#INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/Er7QFxmu4s