Yashasvi Jaiswal Double: టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడుగా రికార్డ్ సృష్టించిన జైస్వాల్

Share the news
Yashasvi Jaiswal Double: టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడుగా రికార్డ్ సృష్టించిన జైస్వాల్

Yashasvi Jaiswal Double

యశస్వి జైస్వాల్ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడిగా నిలిచాడు. జైస్వాల్ 277 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. వైజాగ్ టెస్టు మొదటి రోజు ముగిసే సమయానికి జైస్వాల్ 179 పరుగుల వద్ద అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. వైజాగ్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(Yashasvi Jaiswal Double) పూర్తి చేశాడు. 22 సంవత్సరాల 77 రోజుల వయస్సు గల జైస్వాల్ 277 బంతుల్లో తన ఫీట్‌ను పూర్తి చేసాడు. ఈ క్రమంలో జైస్వాల్ 18 ఫోర్లు, 7 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. గతంలో, వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన జైస్వాల్ అత్యధిక స్కోరు 171. టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదిన నాలుగో ఎడమచేతి వాటం బ్యాటర్ గా జైస్వాల్. గతంలో వినోద్ కాంబ్లీ, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ ఈ ఘనత సాధించిన ముగ్గురూ.

See also  Political Biopics: NTR బయోపిక్ ల నిరాదరణ, టీడీపీ ఓటమి.. యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా?

భారత్‌ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ అత్యుత్తమ బ్యాటింగ్‌ చేశాడు. ప్రస్తుత మ్యాచ్ లో జైస్వాల్ తర్వాత ఒక భారతీయ బ్యాటర్ చేసిన రెండవ అత్యధిక స్కోరు 32, చేసినది అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్.

Yashasvi Jaiswal Double Century చేసి, చివరికి 209 స్కోర్ వద్ద అవుట్ అయినాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ బాటింగ్ కు ప్రత్యర్థి ఇంగ్లాండ్ ఆటగాళ్ల కూడా ఫిదా అయ్యారు. ఔటయ్యి వెళుతున్నప్పుడు అభినందనలు తెలిపారు కూడా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top