
CM Revanth Reddy Review on Rythu Bharosa Funds: రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ విషయంలో కార్యారచణ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రైతు భరోసా నిధుల విడుదల గురించి ఎదురు చూస్తున్న రైతన్నలకు గుడ్ న్యూస్. త్వరలోనే రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)చెప్పారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష లో రైతు భరోసా నిధుల విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ట్రెజరీలో(Treasury) ఉన్న నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల మొదలు అవుతుందని సీఎం రేవంత్ సమీక్షలో చెప్పారు. మరోవైపు, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ విషయంలో కూడా కార్యారచణ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.