Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు!

Share the news
Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు!

Kavitha to Tihar Jail

ఈడీ అభ్యర్థన మేరకు BRS నాయకురాలు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కవిత చాలా పలుకుబడి కల వ్యక్తి అని, బెయిల్‌పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ED వాదించింది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు(KCR) కుమార్తె కవిత (46)ను మార్చి 15 సాయంత్రం హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుండి ఇడి అరెస్టు చేసింది. ఆమెను మార్చి 16న కోర్టు ముందు హాజరుపరచగా, ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించగా .. మొన్న శనివారం న్యాయమూర్తి ఆమెకు ఈడీ కస్టడీని మంగళవారం వరకు పొడిగించారు. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. దీనితో కవితను తీహార్ జైలుకు (Kavitha to Tihar Jail)తరలిస్తున్న ఈడీ అధికారులు.

See also  AP DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ వేటు!

సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి మరియు న్యాయవాదులు నితేష్ రాణా మరియు దీపక్ నగర్‌లతో కూడిన కవిత న్యాయవాద బృందం ఆమె 16 ఏళ్ల కుమారుడి పాఠశాల పరీక్షలను ఉటంకిస్తూ మధ్యంతర బెయిల్ దరఖాస్తును సమర్పించింది. సాధారణ బెయిల్ దరఖాస్తు ఇప్పటికే న్యాయమూర్తి ముందు పెండింగ్‌లో ఉంది.

ఈడీ తరపున హాజరవుతున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోహెబ్ హొస్సేన్ ప్రత్యుత్తరం దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరడంతో ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ దరఖాస్తును ఏప్రిల్ 1న విచారణకు వాయిదా వేసింది. కవిత మొదట్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, అయితే ఆమె అభ్యర్థనపై మార్చి 22న ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది, మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఆమె రాజకీయ నాయుకురాలు కాబట్టి లేదా నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం ఉన్నందున ఆమె బెయిల్ అభ్యర్థనను నేరుగా విచారించబోమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

కోర్టుకు హాజరు పరిచిన సమయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ ” ఇది తప్పుడు కేసు. మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసన్నారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. నన్ను భయపెట్టవచ్చు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయలేరు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీ(BJP) లో చేరాడు. మరొకరికి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇంకొకరు 50 కోట్లు బాండ్ల రూపంలో బీజేపీ కి ఇచ్చాడని” ఆవిడ ఆరోపించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top