Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ!

Share the news
Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ!

ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న Nita Ambani

సంజీవ రెడ్డినగర్, హైదరాబాద్: బల్కంపేట(Bulkampet) ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో(Ellamma Temple) అమ్మవారిని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కుంట నాగరాజు, ఛైర్మన్‌ కొత్తపల్లి సాయిబాబాగౌడ్‌ ఆమెకు స్వాగతం పలికారు. అద్దాల మండపాన్ని నీతా అంబానీ దర్శించుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఐపీఎల్‌ సందర్భంగా నగరంలో ముంబాయి ఇండియన్‌(MI) క్రికెట్‌ జట్టు ఎప్పుడు ఆడినా ఆ టీం యజమానిగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఇకపోతే నిన్నటి ముంబాయి ఇండియన్‌(MI) vs సన్ రైజ్ హైదరాబాద్(SRH) మ్యాచ్ లో SRH ఐపీల్ history లోనే అత్యధిక స్కోర్ చేసి MI మీద గెలిచింది.

-By VVA Prasad

See also  Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top