PM Modi cleans temple premises: నాసిక్‌లోని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచిన మోదీ, ‘స్వచ్ఛత అభియాన్’ కోసం విజ్ఞప్తి

Share the news
PM Modi cleans temple premises: నాసిక్‌లోని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచిన మోదీ, ‘స్వచ్ఛత అభియాన్’ కోసం విజ్ఞప్తి

PM Modi cleans temple premises

మహారాష్ట్రలోని నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో శుక్రవారం జరిగిన ‘స్వచ్ఛత అభియాన్’(Swachhata Abhiyan) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఆలయ ప్రాంగణాన్ని స్వయంగా తుడిచారు (దృశ్యాలను క్రింద వున్న వీడియోలో చూడవచ్చు). అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. అంతే కాకుండా, ఆయన ఆలయం వద్ద కూర్చొని cymbals అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండగా, పలువురు పూజారులు రామ్ భజన ఆలపించారు.

రాముడు అయోధ్యకు తిరిగి రావడం గురించి వివరించే రామాయణంలోని ‘యుద్ధ కాండ’ భాగాన్ని కూడా పూజారులు పాడారు. మరాఠీలో ఈ ‘యుద్ధ కాండ’ భాగాన్ని పాడగా, AI అనువాద ఇంజిన్‌ను ఉపయోగించి శ్లోకాలు ఆయనకు హిందీలో వినిపించబడ్డాయి.

“భారతదేశం, ప్రపంచంలోని మొదటి మూడు స్టార్టప్ సిస్టమ్స్‌లో ఉంది. కొత్త ఆవిష్కరణలు చేస్తోంది, భారతదేశం రికార్డు స్థాయిలో పేటెంట్లను దాఖలు చేస్తోంది… వీటన్నింటి వెనుక దేశంలోని యువత ఉంది.. దేశ యువతకు అమృత్ కాల్(Amrit Kaal) ఒక స్వర్ణయుగం.” అని నాసిక్‌లోని తపోవన్ మైదానంలో జరిగిన రాష్ట్రీయ యువ మహోత్సవ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు.

See also  UPI Services Launched in France: Wow UPI సేవలు ఫ్రాన్స్‌లో కూడా!! ఇక ఫ్రాన్స్ లో కూడా రూపాయి చెల్లుతుంది..

“ఈ రోజు భారతదేశపు యువశక్తి దినం. బానిసత్వపు రోజుల్లో భారతదేశాన్ని కొత్త శక్తిని నింపిన మహనీయునికి ఈ రోజు అంకితం… స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది… రాష్ట్రీయ యువ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో ‘నారీ శక్తి’కి ప్రతీక అయిన రాజ్‌మాతా జిజా బాయి జయంతి కూడా , “అని ప్రధాని అన్నారు.

యువత శక్తికి కృతజ్ఞతలు తెలుపుతూ భారతదేశం ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని, దేశ యువతకు ‘అమృత్ కాల్’ స్వర్ణ కాలం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాల్లో భాగంగా, ప్రధాని మోదీ 11 రోజుల ప్రత్యేక ‘అనుష్ఠాన్’ను కూడా ప్రారంభించారు, ఇది సాంప్రదాయ పద్ధతులు మరియు రాబోయే కార్యక్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై ఆయన నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఈ భక్తి కాలంలో సాధారణ ఆహారం, తెల్లవారుజామున ప్రార్థనలు మరియు హిందూ గ్రంధాలచే సూచించబడిన ఇతర ఆచారాలు ఉంటాయి.

See also  Telugu Person as CS: అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) గా తెలుగు వ్యక్తి..!

PM Modi cleans temple premises; Watch the video here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top